2017-18 ఆడిట్ నివేదిక దాఖలుకు జీఎస్టీ నెట్వర్క్ పోర్టల్ సిద్ధం
జీఎస్టీ అమల్లోకి వచ్చిన అనంతరం మొట్టమొదటి ఆర్థిక సంవత్సరమైన 2017-18కు ఆడిట్ నివేదికను జూన్ 30 కల్లా దాఖలు చేయుటకు వీలుగా జీఎస్టీ నెట్వర్క్ పోర్టల్లో ఓ ఫార్మాట్ను జీఎస్టీ నెట్వర్క్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
*రూ.2 కోట్లకు పైగా వార్షిక టర్నోవరు ఉన్న వ్యాపారులు 2017-18 ఆర్థిక సంవత్సరానికి జీఎస్టీ ఆడిట్ నివేదికలను దాఖలు చేయడం ప్రారంభించవచ్చు.
*ఆడిట్ నివేదికల నిమిత్తం జీఎస్టీఆర్-9, జీఎస్టీఆర్-9ఏ, జీఎస్టీఆర్-9సీ వార్షిక రిటర్న్ ఫారాలను 2018 డిసెంబరు 31న ప్రభుత్వం నోటిఫై చేసింది.
*జీఎస్టీఆర్-9ను జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్న ప్రతి ఒక్కరూ దాఖలు చేయాల్సి ఉంటుంది
*జీఎస్టీఆర్-9ఏ కాంపోజిషన్ చెల్లింపుదార్లు దాఖలు చేయాలి
*జీఎస్టీఆర్-9సీ అనేది కాస్ట్ అకౌంటెంట్ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ పరిశీలించి, సంతకం చేసిన రీకాన్సిలేషన్ స్టేట్మెంట్.
*ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.2 కోట్లకు మించి టర్నోవరు ఉన్న పన్ను చెల్లింపుదారు దీనిని ఏటా సమర్పించాల్సి ఉంటుంది.
*జీఎస్టీ మండలి గత డిసెంబరులో వీటి దాఖలు గడువు తేదీని మూడు నెలలు అంటే జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది.
జీఎస్టీ మండలి:
కౌన్సిల్ సిఫారసుల్లో కేంద్రానికి 1/3 వంతు ఓటు, రాష్ట్రాలకు 2/3 వంతు ఓటు హక్కు ఉంటుంది. తీర్మానానికి 3/4 వంతు మెజార్టీ అవసరం.
జీఎస్టీలో కీలకమైన పన్ను రేటును ఈ కౌన్సిలే నిర్ణయిస్తుంది
జీఎస్టీ కౌన్సిల్ కు కేంద్ర ఆర్థిక మంత్రి చైర్మన్ గా వ్యవహరించనుండగా, రాష్ట్రాల ఆర్థికమంత్రులు సభ్యులుగా ఉంటారు
వస్తు సేవలపై పన్ను రేటు ఎంత ఉండాలి? మినహాయింపు ఉండే విభాగాలేంటి? పన్ను విధానం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం తదితర అంశాలపై నిర్ణయాలపై ఈ కౌన్సిల్ నిర్ణయమే కీలకం
రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తులు సంభవిస్తే అదనపు వనరుల సేకరణకు ప్రత్యేక రేట్లు నిర్ణయించడం మరియు సంబంధిత విషయాలపై నిబంధనలు నిర్ణయించే అధికారం కలదు