ఆశా, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలతో ప్రధాని నరేంద్రమోడి 2018 సెప్టెంబర్ 9న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. ఆశా, అంగన్వాడి కార్యకర్తలకు అక్టోబర్ నుంచి వారి నెలవారీ గౌరవ వేతనాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు.
ఆశా కార్యకర్తను పలు సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి తీసుకొస్తామని, ప్రధాన్మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రైమ్మినిస్టర్ సురక్షా బీమా యోజన కింద ఉచిత బీమా కల్పిస్తామని, ఏదైనా ప్రమాదానికి గురైతే వారికి రూ.4 లక్షల వరకు బీమా పరిహారం చెల్లిస్తామని చెప్పారు.
రూ.3 వేల గౌరవ వేతనం పొందుతున్న వారికి తాజా పెంపుతో ఇకపై రూ.4,500 లభిస్తుంది. రూ.2200గా ఉన్నవారి వేతనం రూ.3,500కు పెరగనుంది. అంగన్వాడీ సహాయకు గౌరవ వేతనాన్ని రూ.1500 నుంచి రూ.2,500కు పెంచుతున్నట్లు మోడి వెల్లడించారు.
ఈ పెంపు అక్టోబర్ నుంచే అమల్లోకి రాబోతున్నా, నవంబర్ వేతనాల్లో ప్రతిబింబిస్తుందని, ఇది వారికి దీపావళి కానుక అని మోదీ అభివర్ణించారు. కామన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్(ఐసీడీఎస్-సీఏఎస్) ఉపయోగిస్తున్న అంగన్వాడీ కార్యకర్తు, సహాయకులకు అదనంగా రూ.250-రూ.500 మధ్య ప్రోత్సాహకాలివ్వనున్నట్లు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా సుమారు 14 లక్షల అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఆరేళ్లలోపున్న చిన్నారులు, గర్భిణలు, పాలిచ్చే తల్లులు సుమారు 10 లక్షల మంది దాకా ఈ కేంద్రా ద్వారా ప్రయోజనం పొందుతున్నారు.
12,83,707 అంగన్వాడి కార్యకర్తలు, 10,50,564 సహాయకులు వారికి సేవలందిస్తున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారు.
2018 సెప్టెంబర్ 23న జార్ఖండ్లో ప్రారంభించబోతున్న ప్రతిష్టాత్మక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులను గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. హర్యానాలోని కర్నాల్ జిల్లాలో ఇటీవల జన్మించిన కరిష్మ అనే చిన్నారి ఈ పథకంలో తొలి లబ్ధిదారు అని వెల్లడించారు.
షికాగోలో స్వామి వివేకానంద ప్రసంగించి 125 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కోయంబత్తూరులోని శ్రీరామకృష్ణ మఠం నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి నరేంద్రమోడి వీడియో ద్వారా మాట్లాడారు.