తెలంగాణలోని సిద్దిపేటలో 150 ఎంబీబీఎస్ సీట్లతో ప్రభుత్వ వైద్యకళాశాల నెలకోల్పడానికి భారతీయ వైద్య మండలి(MCI) అనుమతించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం 7 ప్రభుత్వ వైద్యకళాశాలలు ఏర్పాటు చేసినట్లు అయింది. తెలంగాణ వచ్చాక మహబూబ్నగర్ వైద్యకళాశాలను మొదటగా నెలకోల్పగా ఇది రెండోది. సిద్ధిపేట వైద్యకళాశాలకు నూతన అనుమతితో పాటు మహబూబ్నగర్ వైద్యకళాశాలకు మూడో ఏడాదికి 150 సీట్లను, ఈఎస్ఐ వైద్యకళాశాలకు 100 సీట్లను, నిజామాబాద్ వైద్యకళాశాలకు 100 సీట్లను కూడా 2019-20 వైద్య విద్య సంవత్సరానికి ఎంసీఐ పునరుద్ధరించింది.
MCI-Medical Council of India
views: 854