Event-Date: | 29-Oct-2019 |
Level: | National |
Topic: | Judiciary and Judgement |
జస్టిస్ బాబ్డే నియామకానికి రాష్ట్రపతి ఆమోదం
* సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బాబ్డే నియామకంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు.నవంబర్ 18న ఆయన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
*ప్రస్తుతమున్న చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబర్ 17వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు.
* *సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా శరద్ అరవింద్ బోబ్డే బాధ్యతలు చేపడతారు.
*శరద్ అరవింద్ బోబ్డే - 1956 ఏప్రిల్24న మహారాష్ట్రలోని నాగపూర్కు చెందిన న్యాయవాద కుటుంబంలో బోబ్డే జన్మించారు. నాగ్పూర్ యూనివర్సిటీకి చెందిన ఎస్ఎఫ్ఎస్ కాలేజీలో న్యాయ విద్య అభ్యసించారు. 2012లో మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా బాధ్యతలు స్వీకరించారు.
*ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. రామ జన్మభూమి- బాబ్రీ మసీదు కేసును విచారిస్తున్న ఐదుగురు జడ్జీల ధర్మాసనంలో ఒకరుగా ఉన్నారు.