* కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. తాజాగా కొన్ని కీలక రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేయడంతో పాటు కొత్తవారిని గవర్నర్లుగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.
* గవర్నర్లుగా బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి వీరి నియామకం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
* ఒడిశాకు చెందిన బీజేపీ సీనియర్ నేత విశ్వభూషణ్ హరిచందన్ను ఏపీ గవర్నర్గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
* ఉత్తర్ప్రదేశ్ గవర్నర్గా ఆనందీబెన్ పటేల్ నియామకం(మధ్యప్రదేశ్ నుంచి యూపీకి బదిలీ).
* మధ్యప్రదేశ్ గవర్నర్గా లాల్జీ టాండన్ నియామకం(బిహార్ నుంచి మధ్యప్రదేశ్కు బదిలీ).
* బిహార్ గవర్నర్గా ఫగు చౌహాన్ నియామకం.
* పశ్చిమ బెంగాల్ గవర్నర్గా జగ్దీప్ ధన్ఖర్ నియామకం.
* త్రిపుర గవర్నర్గా రమేశ్ బయాస్ నియామకం.
* నాగాలాండ్ గవర్నర్గా ఆర్ఎన్ రవి నియామకం.
views: 1230